ఓసారి పాదుషా “నసీరుద్దీన్! డబ్బునో, న్యాయన్నో దేన్నో వొకదాన్ని కోరుకోవాల్సి వచ్చిందనుకో, నువ్వు దేన్ని కోరుకుంటావ్?" అని అడిగాడు.
"డబ్బునే!” అని నసీరుద్దీన్ చెప్పాడు.
"ఆఁ! నేనైతే న్యాయాన్ని కోరుకుంటా. డబ్బంటావా, దొరక్కపోదు! కాని న్యాయం ఉందే, అది యీ లోకంలో దొరకడం చాలా కష్టం” అని అన్నాడు పాదుషా.
"లోకంలో జనం తమకి లేనిదాన్నే కోరుకుంటారు. నిజానికి మీరు మీకెన్నడూ లేనిదాన్నే కోరుకున్నారు” అన్నాదు నసీరుద్దీన్. పాదుషా వద్ద డబ్బైతే ఉందిగానీ న్యాయం లేదని అర్ధం.
****
Wednesday, May 20, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment